ఎల్బీనగర్, జనవరి 31: సీఎం రిలీఫ్ ఫండ్తో ఎంతో మంది పేదలకు మేలు చేకూరుతుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. సోమవారం లింగోజిగూడ పాత గ్రామానికి చెందిన కరణ్కు మంజూరైన రూ. 2 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎల్బీనగర్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ.. పేదల ఆరోగ్య పరిరక్షణకు సీఎం సహాయనిధి వరంలాంటిదన్నారు. ఎంతోమంది పేదలు అధునాతన వైద్యసేవలను పొంది సీఎం సహాయ నిధి ద్వారా చేయూతను అందుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తిలక్రావు, కవిత, నిర్మల, మధుసాగర్, చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు.