శంషాబాద్ రూరల్, జనవరి 31 : గెలుపోటములను సమానంగా తీసుకోవాలని ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. సోమవారం మండలంలోని కాచారం గ్రామంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మైలారం భిక్షపతి తన తండ్రి మైలారం బాలయ్య జ్ఞాపకార్థం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. గెలుపొందిన టీమ్కు బహుమతితో పాటు రూ.5 వేల నగదును అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కే చంద్రారెడ్డి, నీరటి రాజు,రాజశేఖర్గౌడ్, శ్రీనివాస్, నీరటి శేఖర్, శివాజీ పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం
అమ్మపల్లి దేవాలయంలో జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ఆలయ చైర్మన్ వినోద్కుమార్ ఆధ్వర్యంలో ధర్మకర్తలు సోమవారం ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ నివాసానికి చేరుకొని ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 6,7,8 తేదీల్లో అమ్మపల్లి దేవాలయంలో జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ను కోరాఉరు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఆలయ ఈవో శ్రీనివాస్, జడ్పీటీసీ నీరటి తన్విరాజు, ధర్మకర్తలు శ్రీనివాస్, అశోక్, లావణ్య, కృష్ణ, మహేశ్,అర్చకులు సత్యనారాయ ణ,అన్వేష్శర్మ తదితరులు ఉన్నారు.