కేపీహెచ్బీ కాలనీ, జనవరి 28 : పేదింట్లో ఆడపిల్ల పెండ్లికి సీఎం కేసీఆర్ పెద్దన్నలా ఆర్థిక సహాయమందిస్తున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లో నియోజకవర్గానికి చెందిన 190 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే కార్పొరేటర్లతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్ల పెండ్లి చేయాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఉండేవని.. నేడు ప్రభుత్వం అందిస్తున్న లక్షా నూటాపదహారు రూపాలయల ఆర్థిక సహాయంతో ఆ పరిస్థితులు మారాయన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మందడి శ్రీనివాస్రావు, పగుడాల శిరీషాబాబురావు, జూపల్లి సత్యనారాయణ, మాజీ కార్పొటర్ తూము శ్రవణ్కుమార్ ఉన్నారు.
సీఎం రిలీఫ్ఫండ్ చెక్కు పంపిణీ..
కూకట్పల్లి డివిజన్కు చెందిన ఎస్.శివ కుమారుడు ఎస్.రామకృష్ణ వైద్య ఖర్చుల నిమిత్తం రూ.2.50 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ను ఎమ్మెల్యే కృష్ణారావు అందజేశారు. అనారోగ్యంతో వైద్యశాలలో చేరి ఖర్చులకు ఇబ్బంది పడే పేదలకు సీఎం రిలీఫ్ఫండ్ వరం లాంటిదన్నారు.
అల్లాపూర్ డివిజన్లో..
పేదల పక్షపాతి సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.అల్లాపూర్ డివిజన్ పరిధి ఎస్.డి ఫంక్షన్హాల్లో కార్పొరేటర్ సబీహాబేగంతో కలిసి 90మంది లబ్ధిదారులకు షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మహ్మద్ గౌసుద్దీన్, డివిజన్ అధక్షుడు లింగాల ఐలయ్య, వీరారెడ్డి, పార్వతమ్మ, రహీమ్, జహేద్ షరీఫ్ బాబా, నూర్ ఖాన్, జావీద్, జ్ఞానేశ్వర్, రజాక్, చాంద్ పాషా, కమల్, రియాజ్, మస్తాన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.