సిటీబ్యూరో, మే 28(నమస్తే తెలంగాణ): ఎండాకాలంలో బంగ్లాలు, వరండాల్లో నిద్రించే మహిళలనే టార్గెట్ చేస్తారు.. వారు గాఢనిద్రలో ఉన్నప్పుడు..చడిచప్పుడు లేకుండా..గొలుసులు తెంపేస్తారు. ఇలా రెండేండ్ల నుంచి దాదాపు 30కి పైగా స్నాచింగ్లకు పాల్పడ్డారు. ఈ చోరీలన్నీ బాధితులు డీప్ స్లీప్(గాఢ నిద్ర)లో ఉన్న సమయంలోనే చేశారు. అర్ధరాత్రి స్నాచింగ్లపై ఫిర్యాదులు రావడంతో నజర్ పెట్టిన రాచకొండ సీసీఎస్ పోలీసులు.. ఇద్దరిని పట్టుకున్నారు. విచారణలో వేసవిని అవకాశంగా మార్చుకొని.. వీరు చేసే కొత్త నేర ప్రక్రియ వెలుగులోకి తీసుకొచ్చింది.
జైలులో పరిచయమై…
మహబూబాబాద్కు చెందిన నర్సయ్య, జంపయ్య, పరుశురాంలు పాత నేరస్తులు. వీరంతా వివిధ నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లినప్పుడు పరిచయమయ్యారు. స్నేహితులుగా మారారు. ముగ్గురు కలిసి ఎండాకాలం దొంగతనాల స్కీంను తెరపైకి తీసుకొచ్చారు. మిగతా సమయా ల్లో మాత్రం ఎవరికి వారు నేరాలు చేసుకుంటారు. సమ్మర్లో మాత్రం ముగ్గురు కలిసి స్నాచింగ్లు చేస్తుంటారు. స్నాచింగ్లకు శివారు ప్రాంతాలతో పాటు కొద్ది పట్టణ ప్రాంతాలను ఎంచుకుంటారు. వేసవిలో ఉక్కపోతకు చా లా మంది ఇంటి వరండా, బంగ్లాలపై నిద్రిస్తుంటారు. అలాంటి ఇండ్లను టార్గెట్ చేస్తారు. కొంతదూరంలో బండిని నిలుపుతారు. ఒకరు కింద నిల్చుంటే.. మరొకరు వరండా, బంగ్లాలపై నిద్రించే మహిళల గొలుసులు తెం పుకొస్తారు.
ఇంకొకరు రోడ్డుపై నిలబడి ఎవరైనా వస్తున్నా రా అని గమనిస్తుంటారు. తస్కరించిన తర్వాత వాటిని విక్రయించి..నగదును పంచుకుంటారు. ఆ పైసలు అయిపోయేంత వరకు ఎవరూ కలుసుకోరు. డబ్బులు అయిపోగానే మళ్లి..ఫోన్లు చేసుకుని స్నాచింగ్లు చేస్తారు. ఇలా ఈ ముగ్గురు మూడు నెలలో దాదాపు 30కి పైగా గొలుసులను కొట్టేశారు. ప్రాథమికంగా ఆదిబట్ల, వెలిగొండ, సిద్దిపేట, భువనగిరి ఇంకా అనేక పట్టణ గ్రామీణ ప్రా ంతాల్లో స్నాచింగ్లకు పాల్పడ్డారు. ఇటీవల పెరిగిన ఈ తరహా ఫిర్యాదులపై రాచకొండ సీసీఎస్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టడంతో కొద్ది రోజుల కిందట నర్స య్య, జంపయ్య పట్టుబడ్డారు. పరుశురాం పరారీలో ఉన్నాడు.
కనిపిస్తే తెంపేస్తాడు..
సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ): బయట ఉంటే స్నాచింగ్లు.. లేదంటే జైలు జీవితం గడుపుతూ.. సుమారు 16 ఏండ్లుగా ఒక స్నాచర్ 135 చోరీలకు పాల్పడ్డాడు. రెండు సార్లు పీడీయాక్ట్లు పెట్టినా బుద్ధిమారలేదు. జైలు నుంచి బయటకు వచ్చి తిరిగి స్నాచింగ్లు మొదలు పెట్టడంతో సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని పట్టుకున్నారు. శనివారం సౌత్జోన్ డీసీపీ సాయి చైతన్య, టాస్క్ఫోర్స్ డీసీపీ చక్రవర్తి గుమ్మిలు వివరాలు వెల్లడించారు. బండ్లగూడకు చెందిన మహ్మద్ ఫైసల్ షా అలీ జబ్బిరి 2006 నుంచి స్నాచింగ్లు మొదలు పెట్టాడు. ట్రై పోలీస్ కమిషనరేట్ పోలీసులకు అనేకసార్లు చిక్కి జైలుకు వెళ్లి వచ్చాడు. ఇతడిపై రెండు సార్లు పీడీయాక్ట్ ప్రయోగించారు.
ఏప్రిల్ 8న జైలు నుంచి బయటకు వచ్చిన ఫైసల్ బండ్లగూడకు చెందిన మహ్మద్ ఖలీల్ వద్ద ఆశ్రయం పొందాడు. ఇద్దరు కలిసి తిరిగి స్నాచింగ్లు చేయడం ప్రారంభించారు. నెల రోజుల వ్యవధిలో షాలిబండ, నారాయణగూడ, సరూర్నగర్ పోలీస్స్టేషన్ల పరిధిలో మూడు గొలుసు దొంగతనాలు చేశారు. టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర బృందంతో పాటు షాలిబండ అదనపు ఇన్స్పెక్టర్ మునావర్ షరీఫ్ టీమ్ నిందితులిద్దరిని అదుపులోకి తీసుకొని విచారించింది. మూడు ఘటనలు తామే చేశామని, ఫైసల్ స్నాచింగ్ చేస్తే.. ఖలీల్ ఆ బంగారాన్ని బయట అమ్మేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ మేరకు ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 12 తులాల బంగారం, బైక్ను స్వాధీనం చేసుకున్నారు.