సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ) :మహానగరాన్ని వరద బాధ నుంచి తప్పించేందుకు ప్రభుత్వం ప్రారంభించిన స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రొగ్రాం(ఎస్ఎన్డీపీ) పనులు శరవేగంగా సాగుతున్నాయి. రెండేండ్ల కింద కురిసిన భారీ వర్షానికి నగరం అతలాకుతలమైంది. ఎంతటి వానొచ్చినా వరద సాఫీగా సాగేందుకు బల్దియా రూ.954 కోట్లతో నాలాల విస్తరణ, కాల్వల నిర్మాణం, చెరువుల ఆక్రమణల తొలగింపు, బాక్స్డ్రెయిన్ల నిర్మాణం చేపట్టింది. ఎస్ఎన్డీపీ కింద 60 పనులు తలపెట్టగా, జీహెచ్ఎంసీ పరిధిలో 37 పనులు వివిధ దశల్లో చురుగ్గా సాగుతున్నాయి. నాలా పనుల పురోగతిపై ఇప్పటికే పలుమార్లు పురపాలక మంత్రి కేటీఆర్ సమీక్షించి వరద వల్ల ఇబ్బందులు కాకుండా, ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనుల పర్యవేక్షణ కోసం 5 బల్దియా జోన్లకు ముగ్గురు సీఈలను ప్రత్యేకంగా నియమించారు.
జీహెచ్ఎంసీ చుట్టూ
మున్సిపాలిటీల్లో 23 పనులకు 21 పనులు వివిధ దశల్లో ఉండగా, బల్దియా అవతల నిజాంపేట కార్పొరేషన్లో 9 పనులు, మీర్పేట కార్పొరేషన్లో 3, బడంగ్పేట కార్పొరేషన్లో 7, జల్పల్లి 2, పెద్దఅంబర్పేట 1, కొంపల్లిలో ఒకచోట చురుగ్గా సాగుతున్నాయి.