సిటీబ్యూరో, మే 20 (నమస్తేతెలంగాణ) : మొన్నటివరకు భానుడి భగభగలతో వేడెక్కిన నగరం రెండురోజులుగా చల్లబడింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో శుక్రవారం పలుచోట్ల గాలిదుమారంతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. రాగల 3 రోజులు వానలు కురిసే అవకాశముంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 36.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 25.6 డిగ్రీలు నమోదైంది.