చార్మినార్, మే 20 : పదవ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని విద్యాశాఖ ఉప విద్యాధికారులు తెలిపారు. ఈ నెల 23వ తేదీ నుంచి నిర్వహించే వార్షిక పరీక్షలకు ఎలాంటి అవకతవకలు జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పాతనగరంలోని బహదూర్పుర, చార్మినార్, బండ్లగూడ మండల పరిధిల్లో సుమారు 20 వేల మంది విద్యార్థులు వార్షిక పరీక్షల్లో పాల్గొంటున్నారని తెలిపారు.
బహదూర్పుర మండల పరిధిలో.. పరీక్షలకు వివిధ పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలు 27, రెసిడెన్షియల్ పాఠశాలలు 4, ఎయిడెడ్ పాఠశాలలు 15, ప్రైవేట్ పాఠశాలలు 133 నుంచి బాలురు 5346, బాలికలు 5545 మంది ఉన్నారని, మొత్తం 10వేల 891 మంది విద్యార్థులు పరీక్షల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రాన్ని పూర్తిస్థాయిలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో కొనసాగించనున్నామని తెలిపారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు ఒక గంట ముందు చేరుకోవాలని, మాస్కులతోపాటు పెన్ను పరీక్షల్లో ఉపయోగించే వస్తువులను వెంట తెచ్చుకోవాలని బహదూర్పుర డిప్యూటీ విద్యాశాఖ అధికారి ఖాజా ముఖ్రం సూచించారు.