సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ): ప్లాటు కొనుగోలుదారుడి నుంచి వాయిదాల రూపంలో స్వీకరించిన మొత్తాన్ని పరిగణలోకి తీసుకొని ఓపెన్ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసివ్వాల్సిందేనని నార్నే ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్కు వినియోగదారుల ఫోరం-1 ఆదేశించింది. బోడుప్పల్కు చెందిన జి. సత్యనారాయణమూర్తి ప్రైవేట్ విశ్రాంత ఉద్యోగి. 1996లో బీబీనగర్లో ‘ఈస్ట్ సిటీ’ ప్రాజెక్టులో 60 వాయిదాల్లో 250 గజాల ఓపెన్ ప్లాట్ను కొనుగోలు చేశారు. 48 వాయిదాలు చెల్లించాక ఉద్యోగం పోయింది. అప్పటి వరకు నెలజీతం నుంచి వాయిదాలు చెల్లిస్తూ ఉండగా, మిగిలిన 12 వాయిదాలను నగదు రూపంలో స్వీకరించాలని ఆయన కోరినప్పటికీ సదరు సంస్థ స్పందించలేదు. దీంతో బాధితుడు హైదరాబాద్ వినియోగదారుల ఫోరం-1 ను ఆశ్రయించాడు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన ఫోరం-1 మిగిలిన 12 ఇన్స్టాల్మెంట్లను స్వీకరించి కొనుగోలుదారుడి పేరున రిజిస్ట్రేషన్ చేయించాలని ఆదేశించింది. అదేవిధంగా బాధితుడికి నష్టం కలిగినందున రూ. 10వేల నష్టపరిహారం, ఖర్చుల కింద మరో రూ.5వేలు 45 రోజుల్లోగా చెల్లించాలని ఫోరం-1 బెంచ్ అధ్యక్షురాలు బి.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యులు రామ్మోహన్, సి.లక్ష్మీప్రసన్న కూడిన బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.