అమీర్పేట్, మే 19 : సనత్నగర్ నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు ఎక్కడా నిధుల లోటు లేకుం డా చూస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నా రు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఇప్పటివరకు ప్రజా సమస్యల పరిష్కారానికి, మౌలిక వసతుల కల్పనకు రూ. 1600 కోట్లను వెచ్చించడం జరిగిందని అన్నారు. తా జాగా రూ. 1.74 కోట్ల వ్యయంతో అమీర్పేట్ డివిజన్ నలుమూలలా వివిధ అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఇంత పెద్దయెత్తున అభివృద్ధి పను లు జరుగుతుండడం నియోజకవర్గంలో గతంలో ఎన్న డూ జరగలేదని వివరించారు. గురువారం కార్పొరేటర్ కేతినేని సరళ, మాజీ కార్పొరేటర్ ఎన్, శేషుకుమారితో కలిసి అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశా రు.
లీలానగర్లో రూ. 13.80 లక్షలతో మంచినీటి పైపులైను, రూ. 3.80 లక్షలతో ఫుట్పాత్ డ్రైన్ పనులు, బీజేఆర్నగర్-2లో రూ. 13.50 లక్షలతో మంచినీటి పైపులైను పను లు, శివభాగ్లో రూ.14.70 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణాలు, ఎస్ఆర్నగర్ పీఎస్ సమీపంలో, బీ టైపు క్వార్టర్లలో రూ. 19.30 లక్షలతో మంచినీటి పైపులైను పనులు, చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ నివాసం సమీపంలో రూ. 25లక్షలతో సీసీ రోడ్డు, ఫుట్పాత్ నిర్మాణాలు, ఎస్ఆర్నగర్లో శివసాయి ట్రేడర్స్ నుంచి ఎస్ఎస్ బేకర్స్ వరకు ఫుట్పాత్ రీమోడలింగ్, ర్యాంపుల నిర్మాణాలు, బాపూనగర్లో రూ. 16.90 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణాలు, ఎస్ఆర్నగర్ అల్మాస్ హోటల్ పరిరాల్లో రూ. 16.20 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా వినాయక దేవాలయం సమీపంలో శిథిలావస్థకు చేరిన సీసీరోడ్డు నిర్మాణాలకు, ఎస్ఆర్టీ క్వార్టర్లలో ముంపు సమస్య నివారణకు వరద నీటి కాలువల నిర్మాణాలు చేపట్టాల్సిందిగా స్థానికులు చేసిన విజ్ఞప్తికి స్పందించిన మంత్రి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. సమస్యలు ఏమైనా ఉంటే వాటిని వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ మోహన్రెడ్డి, డీఈఈ యతీంద్ర మోహన్, జలమండలి జీఎం హరిశంకర్ పాల్గొన్నారు.