కవాడిగూడ, మే 19: అరవింద్నగర్ కాలనీ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. కాలనీలో ఎలాంటి సమస్యలు తలెత్తినా నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కాలనీ వాసులను కోరారు. ఈ మేరకు గురువారం కవాడిగూడ డివిజన్ దోమలగూడలో గల అరవింద్నగర్లో వివిధ శాఖల అధికారులు, కాలనీవాసులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాలనీలోని పలు సమస్యలను అరవింద్నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు డీవీఆర్కే రాజు, ప్రధాన కార్యదర్శి ధనుంజయ, కాలనీ వాసులు జీవీఆర్కే మూర్తి, ఆనందమూర్తి, అపర్ణ, అరుణ కుమారిలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ సానుకూలంగా స్పందిస్తూ కాలనీలో ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేసి ఆకతాయీల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సంజయ్కుమార్కు తెలిపారు. డ్రైనేజీ, రోడ్ల సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులను ఆదేశించారు. కాలనీలో ఎలాంటి సమస్యలు తతెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆయన పలు శాఖల అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నగర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, డీఎంసీ హరికృష్ణ, ఏఎంహెచ్ఓ మైత్రేయ్, చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ సంజీవ్ కుమార్, జీహెచ్ఎంసీ డీఈ సన్నీ, ఏఈ శ్రావణి, వాటర్ వర్క్స్ డీజీఎం చంద్రశేఖర్, ఎస్ఎన్డీపీ ఈఈ గోవర్ధన్, డీఈలు ప్రవీణ్, అరుణ, వాటర్ వర్క్స్ ఏఈ శ్రీధర్, కవాడిగూడ డివిజన్ అధ్యక్షుడు వల్లాల శ్యామ్యాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్వగోపి, నాయకులు మధు, రాంచందర్, రాజశేఖర్ గౌడ్, శ్రీహరి, ముచ్చకుర్తి ప్రభాకర్, కే. శ్రీను, హనుమంత రావు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
రాంనగర్ డివిజన్కు చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గురువారం పంపిణీ చేశారు. ఇంటింటికీ వెళ్లి నేరుగా లబ్ధిదారులను కలిసి చెక్కులు అందజేశారు. లబ్ధిదారులు సీహెచ్ స్పందన, సంధ్య, దేవేందర్ బాబు, మంజుమ్, అనితలకు రూ.2.58 లక్షల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ముఠా జయసింహ, రాంనగర్ డివిజన్ అధ్యక్షుడు ఆర్ మోజస్, దామోదర్రెడ్డి, ఎర్రం శేఖర్, ముక్తార్ హుస్సేన్, గోక నవీన్, మధు, రాజు, సందీప్, ముచ్చకుర్తి ప్రభాకర్, శ్రీకాంత్, నీలాదేవి, సందీప్, మంజుల, మరియ, శివ, జ్ఞానేశ్వర్ గౌడ్లు పాల్గొన్నారు.