వ్యవసాయ యూనివర్సిటీ, మే 13: సాగురంగంలో విప్లవాత్మక మార్పులు రావాలని, నూతన టెక్నాలజీతో తక్కువ ఖర్చు, ఎక్కువ దిగుబడి వచ్చేలా రైతులను ప్రోత్సహించాలని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐసీఎఆర్-ఐఎఆర్ఐ) డైరెక్టర్ డాక్టర్ ఏకే సింగ్ అన్నారు. శుక్రవారం రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. అత్యధిక మానవవనరులు కలిగిన మనదేశంలో ప్రతి ఏడాది ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుండడం వల్ల ఆహారభద్రతకు ఇబ్బంది లేని పరిస్థితులున్నాయన్నారు. నూనెగింజలు, పప్పుదినుసుల విషయంలో దిగుమతులపై ఆధారపడాల్సి వస్తుందన్నారు. వాతావరణ మార్పుల వల్ల దేశ వ్యవసాయరంగం అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నదని, దీనిప్రభావం పంటల ఉత్పత్తి, ఉత్పాదకతపై చూపుతుందన్నారు.తెలంగాణలో వరి, చెరుకు, రాగి తదితర పంటల ఉత్పత్తి తక్కువ ఉందని, వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.ఉద్యోగ విరమణ చేసిన రఘోత్తంరెడ్డి వ్యవసాయ విద్యతోపాటు, వ్యవసాయంలో అందించిన సేవలు మరువలేనివన్నారు. టెస్కాబ్ చైర్మన్ తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వ్యవసాయరంగం అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నదని,ప్రధానంగా యువతను ఈ రంగంవైపు మళ్లించాలన్నారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ప్రవీణ్రావు, అనిల్కుమార్, ఎర్రం రాజు, అధ్యాపకులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ రైతులకు పురస్కారాలు అందజేశారు.