మూసాపేట, మే13: చివరి మజిలీ గౌరవప్రదంగా ఉండాలనే సంకల్పంతోనే తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సౌకర్యార్థం సకల హంగులతో వైకుంఠ ధామాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే నియోజకవర్గంలోని కూకట్పల్లి డివిజన్ పరిధి ప్రశాంత్నగర్ శ్మశాన వాటికను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. శ్మశాన వాటిక అభివృద్ధికి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో రూ. 32లక్షలు నిధులు కేటాయించారు.
చుట్టు పక్కల ప్రాంతాల నుంచి..
ప్రశాంత్ నగర్ వైకుంఠధామానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మృతదేహాలు అంత్యక్రియల కోసం తీసుకువస్తుంటారు. మృతులకు సంబంధించిన కుటుంబీకులు,అత్మీయులు, సన్నిహితులు చివరి చూపు కోసం ఇక్కడికి వస్తుంటారు. అలా వచ్చిన వారికి అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జీహెచ్ఎంసీ వారు చర్యలు తీసుకుంటున్నారు.
సుందరీకరణకు ప్రాధాన్యం
అంత్యక్రియలకు వచ్చే వారికి నీటి వసతి, కూర్చోవడానికి బెంచీలు, మూత్రశాలలు మరుగుదొడ్లు, వెయిటింగ్హాల్, గ్యాలరీ, నిర్మించునున్నారు. పురుషులు, మహిళలకు వేర్వేరుగా స్నానాల గదులను ఏర్పాటు చేసి నీటి సమస్య తలెత్తకుండా చూస్తారు. అంత్యక్రియల క్రతువు నిర్వహణకు వసతులు కల్పించనున్నారు. పార్కింగ్ సముదాయాన్ని ఏర్పాటు చేయనున్నారు. అన్ని రకాల మొక్కలను నాటి పచ్చదనం పెంపొందిస్తారు. ప్రశాంత్నగర్ శ్మశాన వాటికలో అభివృద్ధి పనులు త్వరలోనే పూర్తి కానున్నాయి.
అన్ని సౌకర్యాలు కల్పిస్తాం..
ప్రశాంత్నగర్ శ్మశానవాటిక అభివృద్ధికి రూ. 32లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో వెయిటింగ్హాల్ గ్యాలరీ శ్మశానవాటిక కమాన్, అంత్యక్రియాలు చేసిన వారి తలనీలాలు తీసుకుంనేందుకు గదులు నిర్మిస్తున్నాం. అంత్యక్రియలకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల నిర్మాణాలు చేపట్టి, సౌకర్యాలు కల్పిస్తున్నాం. అభివృద్ధికి సహకరించి నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు ధన్యవాదాలు.
– జూపల్లి సత్యనారాయణ కూకట్పల్లి కార్పొరేటర్