కేపీహెచ్బీ కాలనీ,మే 12: కేపీహెచ్బీ కాలనీ 6వ ఫేజ్ పరిసరాలన్ని శివనామ స్మరణతో మార్మోగాయి. శంభోశంకరా.. హరహర మహాదేవా అంటూ భక్తులు పరమశివుడిని పూజించారు. కేపీహెచ్బీ కాలనీ కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావు ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీఉమారామలింగేశ్వరస్వామి ఆలయంలో గురువారం శ్రీరామలింగేశ్వరస్వామి (మహాలింగం), ఉమాదేవి, నవగ్రహా లు, ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు.మండప దేవత పూజ లు, అదివాస హోమాలు, గర్తపూజలు, రత్నాన్యాసం, దాతున్యాసం, బీజన్యాసం, యంత్ర స్థాపన, ధ్వజబింబ స్థాపనములు, కళాన్యాసం, కుంభంపోయుట, ధేనుదర్శనము, పూర్ణాహుతి, అవబృదస్నాన పూజలు జరిగాయి. అనంతరం జరిగిన శాంతి కల్యాణం పూజల్లో కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావు శైలజ, శ్రీహర్ష శ్రావ్య దంపతులు, ప్రణీత్ పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు
కేపీహెచ్బీ కాలనీ 6వ ఫేజ్లో నూతనంగా నిర్మించిన శ్రీఉమారామలింగేశ్వరస్వామి ఆలయంలో విగ్రహ ప్రతి ష్ఠలో ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠతోపాటు రామలింగేశ్వర, ఉమాదేవి, గణనాథుడి విగ్రహాల ప్రతిష్ఠ పూజల్లో పాల్గొన్నారు. అలాగే నియోజకవర్గం కో ఆర్డినేటర్ సతీశ్ అరోరా, బాలాజీనగర్ డివిజన్ కార్పొరేటర్ శిరీషాబాబురావు దంపతులు, కార్పొరేటర్లు శ్రీనివాస్రావు,శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ శ్రవణ్కుమార్, మూసాపేట సర్కిల్ ఉప కమిషనర్ రవికుమార్, ఈఈ సత్యనారాయణ, ఏఈ సాయిప్రసాద్, ఆలయాల కమిటీ సభ్యులు, వివిధ కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు, రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు.