మణికొండ, మే 12 : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజల్లో ఉంటూ పనులు చేయాలని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ సూచించారు. గురువారం నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాల్లో రూ.1.86 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అంతకు ముందు పురపాలక సంఘం కార్యాలయం ముందు 18 మందికి స్వచ్ఛ ఆటోలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ప్రజల పక్షాన ఉంటూ రాజకీయాలకతీతంగా అభివృద్ధి పనుల విషయంలో రాజీలేకుండా పనులు చేయాలని కోరారు. శివారు మున్సిపాలిటీలలో స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు. ఆయా వార్డుల్లో తడి, పొడి చెత్తపై వారంలో ఓ రోజు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. నార్సింగి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చేందుకు సమష్టిగా కృషిచేయాలని కోరారు. కార్యక్రమలో నార్సింగి మున్సిపల్ కమిషనర్ సత్యబాబు, మున్సిపల్ వైస్ చై ర్మన్ వెంకటేశ్యాదవ్, కౌన్సిలర్లు శివారెడ్డి, ఆదిత్యారెడ్డి, అమరేందర్రెడ్డి, పత్తి ప్రవీణ్కుమార్, శ్రీకా ంత్, మాజీ ఎంపీపీ మలేశ్, పార్టీ అధ్యక్షుడు నర్సింహ, మా ర్కెట్ కమిటీ డైరెక్టర్లు రాము, ఫారూ క్,రాజు,నాయకులు నాగేశ్, జితేందర్ పాల్గొన్నారు.
డ్రైనేజీ పనులకు శంకుస్థాపన..
బండ్లగూడ,మే 12: ముంపు ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. సర్కిల్ పరిధిలోని మెఫిల్టౌన్, సాయి గోల్డెన్లో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ ముంపు ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గత వర్షాకాలంలో మెఫిల్టౌన్లోకి పెద్ద ఎత్తున వర్షం నీళ్లు రావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే అధికారులతో చర్చించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మేయర్ మహేందర్గౌడ్, కార్పొరేటర్ అర్చన్ జయ ప్రకాశ్, పద్మావతి పాపయ్య యాదవ్ పాల్గొన్నారు.