అంబర్పేట, మే 12: నర్సుల సేవలు వెలకట్టలేమని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నల్లకుంట ఫీవర్ దవాఖానలో పని చేస్తున్న నర్సులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులకు సేవ చేయడంలో వీరిని మించిన వారు ఎవరూ లేరన్నారు. కరోనా సమయంలో నర్సులు చేసిన సేవలు మరువలేమని కొనియాడారు. కార్యక్రమంలో కార్పొరేటర్ దూసరి లావణ్యశ్రీనివాస్గౌడ్, సూపరింటెండెంట్ శంకర్, ఆర్ఎంవో విజయలక్ష్మి పాల్గొన్నారు.
అభివృద్ధే లక్ష్యంగా ముందుకు..
కాచిగూడ,మే 12: ప్రజల సహకారంతో నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గురువారం కాచిగూడ డివిజన్లోని చెప్పల్బజార్,మణియార్పట్టిలో రూ.7లక్షల వ్యయంతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న డ్రైనేజీ పైప్లైన్ నిర్మాణ పనులను కార్పొటర్ ఉమాదేవితో కలసి ప్రారంభించారు. అనంతరం పలు బస్తీలలో పాదయాత్ర చేస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ అన్ని బస్తీ, కాలనీలను అభివృద్ధి చేస్తానని, ప్రజల కనీస అవసరాలైన మౌలిక వసతుల కల్పనలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. డ్రైనేజీ వ్యవస్థను త్వరిగతిన ఆధునీకరిస్తామని ఆయన అన్నారు. కార్యక్రమంలో జలమండలి డీజీఎం సన్యాసిరావు, మేనేజర్ భావన, కన్నె రమేశ్యాదవ్, సునీల్బిడ్లాన్, కాచిగూడ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్ర బీష్మాదేవ్, ప్రధాన కార్యదర్శి సదానంద్, డాక్టర్ శిరీషాయాదవ్, బద్దుల ఓం ప్రకాశ్యాదవ్,రవీందర్యాదవ్, నాగేందర్బాబ్జి, కృష్ణాగౌడ్, మహేశ్కుమార్, మన్నె శ్రీనివాస్యాదవ్, పాండు, బబ్లూ, ఆంటోని, రమాదేవి, బబ్లూ, సుభాశ్పటేల్, హజరిబాబు, కృష్ణకుమార్, క్షీరసాగర్, పట్లూరి సతీశ్, భీంరాజ్, రవియాదవ్, మల్లికార్జున్ పాల్గొన్నారు.
డ్రైనేజీ పైపులైన్ పనులు ప్రారంభం
గోల్నాక, మే 12: నియోజకవర్గ వ్యాప్తంగా డ్రైనేజీ పైప్లైన్ల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గురువారం గో ల్నాక డివిజన్ జైస్వాల్గార్డెన్లో సుమారు రూ.5లక్షల అంచనా వ్యయంతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న డ్రైనేజీ పైప్లైన్ పనులను కార్పొరేటర్ దూసరి లావణ్యశ్రీనివాస్గౌడ్తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో డ్రైనేజీ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. నాయకులు బుచ్చిరెడ్డి, ఆర్కే బాబు, అరవింద్, రమేశ్, మహేశ్, దేవేందర్, ప్రభాకర్, నర్సింగ్, రాజ్యలక్ష్మి, దివ్యలక్ష్మి ధనలక్ష్మి పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కు అందజేత
పేద కుటుంబాలకు కల్యాణలక్ష్మి పథకం ఓ వరంలాంటిదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కాచిగూడ డివిజన్లోని చెప్పల్బజార్ ప్రాంతానికి చెందిన ధనలక్ష్మికి కల్యాణలక్ష్మి చెక్కును గురువారం ఎమ్యెల్యే కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో కాచిగూడ కార్పొరేటర్ ఉమా రమేశ్యాదవ్, కృష్ణాగౌడ్, కన్నె రమేశ్యాదవ్, ధనలక్ష్మి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
జైస్వాల్గార్డెన్లో..
గోల్నాక డివిజన్ జైస్వాల్గార్డెన్లో ఓ మహిళ తన భర్త నాగేశ్వరరావు మద్యం తాగుతూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్తో గోడు వెళ్లబోసుకున్నారు. స్పందించిన ఎ మ్మెల్యే తన కారులో ఉన్న శాలువాను తెప్పించి నా గేశ్వరరావును సన్మానించి, ఇక నుంచి మద్యం తాగొద్దని సూచించారు.