ముషీరాబాద్/కవాడిగూడ/చిక్కడపల్లి, మే 12: నాయిని కార్మిక పక్షపాతి అని ఎమ్మెల్యే ముఠా గోపాల్, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం ఇందిరాపార్కు చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర తొలి హోం శాఖా మంత్రి స్వర్గీయ నాయిని నర్సింహారెడ్డి 79వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్ఎన్ఆర్ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు నాయిని దేవేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వి. శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ నగర యువజన నాయకుడు ముఠా జయసింహ, నాయకులు శ్రీనివాస్, బింగి నవీన్కుమార్, ముచ్చకుర్తి ప్రభాకర్, బల్లెకారి రమేష్, రాములు, శ్రీను, శ్యామ్, శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.
ముషీరాబాద్ : మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి జయంతి వేడుకలు గురువారం ముషీరాబాద్ నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. పలు డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు నాయిని చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అడిక్మెట్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ నాయిని చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బి.శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాంనగర్ ఈ సేవాల వద్ద జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రేటర్ నేత ఎంఎన్ శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస్రెడ్డి, నాయకులు నేత శ్రీనివాస్, సయ్యద్ అస్లాం, సుబ్బారావు, ప్రేమలతారెడ్డి, సుదేశ్ తదితరులు నాయిని చిత్ర పటానికి పూల మాలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా టీఆర్ఎస్ అడిక్మెట్ డివిజన్ ప్రధాన కార్యదర్శి సురేందర్ ఆధ్వర్యంలో విద్యానగర్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా శ్యామ్సుందర్, అనూరాధ పాల్గొన్నారు.
చిక్కడపల్లి : మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గురువారం పార్టీ నాయకుడు పున్న సత్యనారాయణ ఆధ్వర్యంలో గాంధీనగర్లో నాయిని నరసింహారెడ్డి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నాయిని చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పార్టీ యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, మాజీ కార్పొరేటర్ర్లు ముఠా పద్మానరేశ్, మాచర్ల పద్మజ, పార్టీ సీనియర్ నాయకుడు ముఠా నరేశ్, పార్టీ డివిజన్ అధ్యక్షుడు రాకేశ్, ముచ్చకుర్తి ప్రభాకర్, మారిశెట్టి నర్సింగ్ రావు, ఎర్రం శ్రీనివాస్ గుప్తా, ఆకుల శ్రీనివాస్, జహంగీర్, రవి శంకర్ గుప్తా, జహంగీర్, వెంకటేశ్, ఎస్టీ ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల సక్షేమం కోసం నిరంతరం కృషి..
కార్మికుల సక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడు మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అని మాజీ కార్పొరేటర్, వీఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు వి. శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం బాగ్లింగంపల్లిలోని వీఎస్టీ కార్మిక కార్యాలయంలో నాయిని నరసింహారెడ్డి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ము ఖ్య అతిథిగా హాజరైన యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి నాయిని నర్సింహారెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి అశోక్రెడ్డి, కోశాధికారి ప్రభాకర్, సామ్సన్, బాబి పాల్గొనానరు.