ఘనంగా రాఖీ వేడుకలు సీఎం ఫ్లెక్సీలకు రాఖీలు కట్టిన మహిళా నేతలు, లబ్ధిదారులు పలుచోట్ల వృక్షాబంధన్ సోదరసోదరీమణుల ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్. నేను నీకు రక్ష..అంటూ సోదరికి అభయమిచ్చే వేడుక. శుక్రవారం నగరవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు కోలాహలంగా సాగాయి. అన్నదమ్ములకు రాఖీలు కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. పలువురు మంత్రులు, నేతలకు మహిళా ప్రజాప్రతినిధులు రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఆడబిడ్డల మురిపెంటీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాలతో శుక్రవారం నగరవ్యాప్తంగా మహిళా నేతలు, పింఛన్, కల్యాణలక్ష్మి లబ్ధిదారులు సీఎం ఫ్లెక్సీలకు రాఖీలు కట్టారు.
బంజారాహిల్స్లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మితోపాటు పలువురు మహిళలు సీఎం చిత్రపటానికి రాఖీలు కట్టి అభిమానం చాటుకున్నారు.
– బంజారాహిల్స్, ఆగస్టు 12
మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సమక్షంలో పలువురు మహిళలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టి ఆత్మీయతను చాటుకున్నారు. నిజాంపేట మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డి, కొంపల్లి మాజీ ఎంపీపీ సన్న కవిత శ్రీశైలంయాదవ్, మహిళా నేతలు పాల్గొన్నారు.
– కుత్బుల్లాపూర్, ఆగస్టు12
రాఖీలు కట్టి.. నిబంధనలు తెలిపి ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీసులు రాఖీ పండుగను వినూత్న
రీతిలో నిర్వహించారు. ఎల్బీనగర్, కొత్తపేట, అల్కాపురి, నాగోల్ చౌరస్తాల్లో ట్రాఫిక్ అదనపు ఇన్స్పెక్టర్ నాగమల్లు ఆధ్వర్యంలో హెల్మెట్, సీటు బెల్ట్ ధరించకుండా వాహనాలు నడుపుతున్న వారికి మహిళా పోలీసులు రాఖీలు కట్టి ట్రాఫిక్ నిబంధనలు వివరించారు.
– మన్సూరాబాద్, ఆగస్టు 12
వృక్షాబంధన్అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా సిటీ కాలేజీ విద్యార్థులు గోల్కొండ కోటలో స్వచ్ఛ పక్వాడతోపాటు వృక్షాబంధన్ నిర్వహించారు. వృక్షాల ప్రాముఖ్యతను తెలియజేసేలా పలుచెట్లకు రాఖీలు కట్టారు.
– చార్మినార్, ఆగస్టు 12
వెంగళరావునగర్లో ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సమక్షంలో సీఎం కటౌట్కు రాఖీ కడుతున్న కార్పొరేటర్ దేదీప్య విజయ్, మహిళా ప్రతినిధులు
– జూబ్లీహిల్స్, ఆగస్టు12
మంత్రి సబితారెడ్డి రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. సోదరుడు నర్సింహారెడ్డి ఇంటికెళ్లి రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
– కందుకూరు, ఆగస్టు 12
కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన సోదరీమణులు రాఖీలు కట్టి ఆశీర్వదించారు.
– మేడ్చల్, ఆగస్టు12(నమస్తేతెలంగాణ)
వెస్ట్మారేడ్పల్లిలోని తన నివాసంలో మంత్రి తలసానికి ఇండిపెండెన్స్ రాఖీ కడుతున్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. ఈ రాఖీని మేయర్ సొంతంగా తయారు చేశారు.
– బేగంపేట, ఆగస్టు 12