వెంగళరావునగర్, ఆగస్టు 12: స్వా తంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ మననం చేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అమృత్ మహోత్సవాల సందర్భంగా శుక్రవారం శ్రీనగర్ కాలనీలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ఆకృతి ఆధ్వర్యంలో రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రం భారత కీర్తి మూర్తులు సీడీని మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆకృతి సుధాకర్, సామాజికవేత్త నాగేశ్ పెండ్యాల, ఆకృతి సహ కార్యదర్శి శ్వేత తదితరులు పాల్గొన్నారు.