కవాడిగూడ, ఆగస్టు 12: అట్టడుగు వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పేర్కొన్నారు. దళితబంధు ద్వారా బడుగుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. ఈ మేరకు శుక్రవారం కవాడిగూడ డివిజన్ మారుతీనగర్కు చెందిన లబ్ధిదారుడు ఆర్.రాజేశ్కు దళిత బంధు ద్వారా మంజూరైన మినీ క్యాబ్ను ఎన్టీఆర్ స్టేడియంలో అందజేశారు.
చిక్కడపల్లి, ఆగస్టు 12: ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయాల్సిన బాధ్యత నాయకులపై ఉందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. పార్టీ పటిష్టత కోసం పనిచేస్తున్న పార్టీ సీనియర్నాయకుడు ముఠా నరేశ్ను శుక్రవారం ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు.