చిక్కడపల్లి/కవాడిగూడ/ముషీరాబాద్, ఆగస్టు 12: దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ మహిళల భద్రతకు పెద్ద పీట వేశారని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. రాఖీ పూర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్కు వాల్మీకి నగర్కు చెందిన పలువురు మహిళలు ఆయనను కలిసి రాఖీ కట్టారు. టీఆర్ఎస్ పార్టీ పాశం రవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎ.రేణుక, సుశీల, ఎం.అంజమ్మ, విజయా, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కవాడిగూడ టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు వల్లాల శ్యామ్యాదవ్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు చౌరస్తా వద్ద సీఎం కేసీఆర్ ఫ్లెక్సీతో పాటు ఎమ్మెల్యే ముఠా గోపాల్కు టీఆర్ఎస్ మైనారిటీ నాయకురాలు రఫియా భాను రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు వల్లాల శ్రీనివాస్ యాదవ్, స్వప్న, సుశీల, జానకి, రాజేశ్, స్వామి, సత్తి, ప్రకాశ్, మధు, మహేశ్, వేణు, ఎల్లేశ్, శ్యామ్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా లోయర్ ట్యాంక్బండ్లోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ డీఎస్పీ హైదరాబాద్ జిల్లా శాఖ అధ్వర్యంలో రాఖీ కట్టారు. అదే విధంగా భోలక్పూర్లో ముస్లిం సోదరులకు మహిళలు, యువతులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ జిల్లా అధ్యక్షుడు కార్తిక్ మహరాజ్, ప్రధాన కార్యదర్శి లింగస్వామి, రాములు, కృష్ణ, ఉదయ్కుమార్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.