మల్కాజిగిరి/నేరేడ్మెట్, ఆగస్టు 12: అక్కా చెల్లెళ్ల అనురాగంతో సుభిక్షంగా ఉంటామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శుక్రవారం రాఖీ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్, ప్రజా గాయకుడు గద్దర్కు మహిళలు రాఖీలు కట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అక్క చెల్లెల సంక్షేమం కోసం కృషిచేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సబితాకిశోర్, రాజ్ జీతేంద్రనాథ్, ప్రేమ్కుమార్, సునీతయాదవ్, మాజీ కార్పొరేటర్ జగదీష్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.