బండ్లగూడ / శంషాబాద్ రూరల్, ఆగస్టు 12: అన్నా చెల్లెళ్లకు, అక్కా తమ్ముల అనుబంధానికి రాఖీ పండుగ ప్రతీక అని బండ్లగూడ జాగీర్ ము న్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహేందర్గౌడ్ అన్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యయలంలో మేయర్ మహేందర్గౌడ్, కమిషనర్ వేణుగోపాల్ రెడ్డిలకు సిబ్బం ది రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సందర్భంగా శంషాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మ ఆధ్వర్యం లో పలువురు పోలీసు అధికారులు, సి బ్బందికి ఆమె రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో పాటు నార్సింగి మార్కెట్ కమి టీ చైర్మన్ వెంకటేశ్ గౌడ్ కు ఆయన సోదరిమణులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ వైస్ చైర్మన్ బండిగోపాల్ యాదవ్కు ఇటీవల పవర్లిఫ్టింగ్ విజేతగా నిలిచిన మల్లిక రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
దీంతోపాట మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డుల కౌన్సిలర్లకు వారి కుటుంబ సభ్యులతో పాటు చిన్నారులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని సుల్తాన్పల్లి గ్రామ సర్పంచ్ దండు ఇస్తారికి ఆయన సోదరిమణులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో పాటు ఆయా గ్రామాలలో సర్పంచ్లు, ఎంపీటీసీలకు రాఖీలు కట్టారు. రాజేంద్రనగర్ నియోజక వర్గంలో రాఖీ సందర్భంగా రాజేంద్రనగర్ ఎస్సై స్వేత టీఆర్ఎస్ నాయకుడు సాయి మాలిక్కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.