మేడ్చల్ జోన్ బృందం : నియోజకవర్గ వ్యాప్తంగా రాఖీని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా సోదరీమణులు సోదరులకు రాఖీ కట్టి, సోదరభావాన్ని చాటి చెప్పారు. పలువురు మహిళా ప్రజాప్రతినిధులు మంత్రి మల్లారెడ్డికి రాఖీ కట్టి, నోరు తీపి చేశారు. వజ్రోత్సవాల్లో భాగంగా మున్సిపాలిటీ చైర్పర్సన్లు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి రాఖీలు కట్టి, మిఠాయిలు పంచిపెట్టారు.
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళా ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి రాఖీ కట్టారు. వైస్ చైర్మన్ ప్రభాకర్, కమిషనర్ రాములు, మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాస్రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. మేడ్చల్ మండలం గౌడవెల్లి పరిధిలోని కృషి హోమ్స్ అనాథాశ్రమంలోని విద్యార్థులకు మాజీ ఎంపీపీ పద్మాజగన్ రెడ్డి, రాఖీ కట్టి, మిఠాయిలు పంచిపెట్టారు. లహరిరెడ్డి, మహిళలు పాల్గొన్నారు.
ఘట్కేసర్ మున్సిపాలిటీలోని చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో మహిళా కౌన్సిలర్లు కేసీఆర్ ఫ్లెక్సీకి రాఖీ కట్టారు. తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల జగద్గిరిగుట్ట(శామీర్పేట)ను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ సందర్శించారు. అనంతరం విద్యార్థులతో రాఖీ కట్టించుకున్నారు.