చర్లపల్లి, ఆగస్టు 12 : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని ఎన్ఎఫ్సీ సీఐఎస్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ రాహుల్సింగ్ గౌతమ్, అసిస్టెంట్ కమాండెంట్ మనోజ్కుమార్లు పేర్కొన్నారు. శుక్రవారం సీఐఎస్ఎఫ్ ఎన్ఎఫ్సీ యూనిట్ ఆధ్వర్యంలో సీఐఎస్ఎఫ్ కాలనీ, డీఏఈ కాలనీ, ఈసీఐఎల్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉద్యోగులు, కార్మికులు ప్రతి ఒక్కరూ తమ ఇండ్లపై జాతీయ జెండాలను ఎగురవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐఎస్ఎఫ్ హైదరాబాద్కు చెందిన సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఏఎస్రావునగర్, చర్లపల్లి డివిజన్ల పరిధిలో జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఏఎస్రావునగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషాసోమశేఖర్రెడ్డి, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవిల ఆధ్వర్యంలో సర్కిల్ సిబ్బంది పలు కాలనీలలో జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, ఇప్పటికే ఇంటింటి జాతీయ జెండాల పంపిణీని వేగవంతం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
చర్లపల్లి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల పోరాటం, వారి అనుసరించి విధానాలతో స్టాల్ రూపొదించి ప్రదర్శించారు. అనంతరం బ్యాంక్కు వచ్చే ఖాతాదారులకు బీఓఐ తెలంగాణ జోనల్ మేనేజర్ సువెంద్కుమార్ బెహర, చర్లపల్లి బ్రాంచి మేనేజర్ శ్రావణ్కుమార్లు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ క్రెడిట్ మేనేజర్ బారు శ్రీనివాసరామదాసు, కాలనీవాసులు మురళికృష్ణ, బొడిగె రవీందర్గౌడ్ పాల్గొన్నారు.
స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా రామంతాపూర్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మాజీ కార్పొరేటర్ మందమూల పరమేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తవిడ బోయిన గిరిబాబు, డివిజన్ అధ్యక్షులు తౌఫిక్, అరుణ, జలీల్ పాష, భాస్కర్, ఉపేందర్రెడ్డి, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.