ఉప్పల్/మల్లాపూర్/చర్లపల్లి, ఆగస్టు 12 : నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. రాఖీ పౌర్ణమి సందర్భంగా కాలనీలు, రహదారులు సందడిగా మారాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, కాలనీ ప్రతినిధులకు మహిళలు రాఖీలు కట్టి తమ ఆత్మీయతను పంచుకున్నారు. చిన్నారులు తమ సోదరులకు రాఖీలు కట్టి, ఆనందం పంచుకున్నారు. రాఖీ పౌర్ణ మి పురస్కరించుకొని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి నివాసంలో శుక్రవారం పలువురు మహిళలు రాఖీలు కట్టి, తమ అభిమానం చాటుకున్నారు. ఈ కార్యక్రమం లో రజితారెడ్డి, సుభద్ర, సరిత, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. నాచారం కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్ తన సోదరులకు రాఖీలు కట్టారు.