సికింద్రాబాద్, ఆగస్టు 8: నగర పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 11వ తరగతి వరకు నెలకొకసారి బ్యాగ్లు లేకుండా తరగతులను నిర్వహిస్తున్నట్లు బోయిన్పల్లిలోని సెయింట్ పీటర్స్ హైస్కూల్ పాఠశాల ప్రిన్సిపాల్ కె.సువర్ణ తెలిపారు.
బ్యాగ్లెస్ డేకు సంబంధించి విద్యార్థుల నుంచి అద్భుతమైన స్పందన వస్తున్నదని పేర్కొన్నారు. బ్యాగులు లేకుండా తరగతులను నిర్వహిస్తున్న అతి కొద్ది పాఠశాలల్లో సెయింట్ పీటర్స్ ఉన్నత పాఠశాల ఒకటని తెలిపారు. పాఠశాలలోని 2500 మంది విద్యార్థులు నెలకు ఒకసారి పుస్తకాలు తీసుకురారని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నుంచి వస్తున్న స్పందనను చూస్తుంటే, భవిష్యత్తులో నెలకు రెండుసార్లు బ్యాగ్లెస్ డేను నిర్వహించే విధంగా ఆలోచిస్తున్నామని చెప్పారు. రాయ్పూర్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం బ్యాగ్లెస్ డేగా నిర్వహిస్తున్నారని తెలిపారు. జాతీయ విద్యా విధానంలో సంవత్సరానికి 10 బ్యాగ్-లెస్ రోజులు సిఫార్సు చేసిందన్నారు.