ఆగస్టు 8:మహిళల సంక్షేమానికి పెద్దపీట వేయడమే కాకుండా, వారి అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతున్నదని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని మహిళలు విశేషంగా ఆదరిస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను ఇంటి బాగోగులు చూసే మహిళల పేరిట ప్రవేశపెట్టారని, అందుకే అన్ని పార్టీల వారు టీఆర్ఎస్ పట్ల ఆకర్షితులవుతున్నారని చెప్పారు.
సోమవారం రహ్మత్నగర్ డివిజన్ కార్మికనగర్కు చెందిన వెంకటరత్నకుమారితో పాటు 300 మందికి పైగా మహిళలు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ కార్మికనగర్లో 310 గుడిసె వాసులకు సొంత గృహాలు కేటాయించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని, ఎస్పీఆర్హిల్స్లో రూ.11 కోట్లతో వాటర్ రిజర్వాయర్ నిర్మించడం టీఆర్ఎస్ సర్కారు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సీఎన్రెడ్డి, నాయకులు అప్పూఖాన్, తన్నూఖాన్, డివిజన్ అధ్యక్షుడు మన్సూర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.