కవాడిగూడ, ఆగస్టు 8: కవాడిగూడ డివిజన్లోని దోమలగూడ – ఏవీ కళాశాలలో ఆగస్టు 15 సందర్భంగా కళాశాల స్టూడెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో సోమవారం స్వాతంత్య్ర దిన వజ్రోత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ముందుగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ రాజలింగం, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.పద్మలు జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు 75 సంఖ్యలో నిలబడి చేసిన విన్యాసాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థులకు ‘మీ దేశం, మీ విజన్, వాయిస్ అండ్ వ్యూస్, ఆత్మ నిర్భర్ భారత్’ లపై వ్యాసాలతో పాటు ఇతర సాహిత్య పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ వినీతా శర్మ, అసిస్టెంట్ ప్రొఫెసర్ రేణు మాథుర్, సౌమ్యశ్రీతో పాటు స్టూడెంట్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎ.కేతన్ కుమార్, జాయింట్ సెక్రెటరి డబ్ల్యూ మిహిర భరద్వాజ్, హెడ్ కో-ఆర్డినేటర్ బి.సుమేధ పాల్గొన్నారు.