శంషాబాద్ రూరల్, ఆగస్టు 12 : రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ల పిలుపుమేరకు శంషాబాద్ జడ్పీటీసీ నీరటి తన్విరాజు ఆమె ఇంటిపై కుటుంబ సభ్యులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఇంటిపై తిరంగా జెండా ఎగురవేయాలని అన్నారు. ఎంపీపీ జయమ్మశ్రీనివాస్ ఆమె ఇంటిపై కుటుంబ సభ్యులతో జెండాలను ఎగురవేశారు.
ఆయా గ్రామాలలో సర్పంచ్లు, ఎంపీటీసీలు ఇతర ప్రజా ప్రతినిధులు వారి ఇండ్లపై జాతీ య జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వజ్రోత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.
స్వాతంత్య్రం రావడంతో భారతదేశంలో జరిగిన అనేక మార్పులను ప్రజలకు వివరిస్తూ స్వాతంత్య్ర భారతదేశంలో ప్రజలందరికీ స్వాతంత్య్ర ఫలాలు అందే విధంగా ప్రభుత్వాలు పని చేయాలని సూచించారు. సామాన్య ప్రజలు సైతం వారి ఇండ్లపై జెండాలను ఎగురవేసి దేశంపై ఉన్న భక్తిని చాటుకున్నారు.