సిటీబ్యూరో, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): నగరవాసుల నుంచి ప్రతి రోజు సగటున సైబర్ నేరగాళ్లు కోటి రూపాయలు కొట్టేస్తున్నారని హైదరాబాద్ జాయింట్ సీపీ(క్రైమ్స్) ఏవీ రంగనాథ్ తెలిపారు. గురువారం సీసీఎస్లో మీడియా ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023లో సైబర్ నేరాలలో రూ.140 కోట్ల వరకు నష్టపోగా, రూ. 44 కోట్లు ఫ్రీజ్ చేశామని, ఇందులో రూ. 2 కోట్లలోపే బాధితులకు తిరిగి ఇవ్వగలిగామన్నారు.
చదువుకున్న వారే అత్యాశతో సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారని, తాము మోసపోతున్నామని గుర్తించిన రెండు గంటల్లోపు (గోల్డెన్ అవర్స్) 1930కు కాల్ చేసి సహాయం పొందాలన్నారు. పార్ట్టైమ్ ఉద్యోగాలు, ట్రేడింగ్, కొరియర్ ఫ్రాడ్స్ పెరిగాయ్నారు. క్షేత్ర సాయిలో సమస్యల పరిష్కారానికి త్వరలో బ్యాంకర్లు, సోషల్మీడియా నిర్వాహకులతో సమావేశం నిర్వహిస్తామని, సినీ తారల సహాయం కూడా తీసుకుంటామన్నారు. పోలీసుల పేర్లతో ఫోన్లు చేసి, వీడియో కాల్స్లోయూనిఫామ్లో కనిపిస్తూ ఫేక్ డీపీ వంటివి ఆర్టిఫిషియ్ ఇంటిలిజెన్స్ను ఉపయోగించి ఈ నేరాలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్స్ డీసీపీ కవిత పాల్గొన్నారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హిమాయత్సాగర్, ఔటర్ రింగు రోడ్డు మధ్య ఉన్న 85 ఎకరాల స్థలంలో అద్భుతమైన డిజైన్లతో ల్యాండ్ స్కేపింగ్ పనులు దాదాపు పూర్తయ్యాయి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ల్యాండ్స్కేపింగ్ పనులు అర్బన్ ఫారెస్ట్రీ విభాగం పూర్తి చేయగా, ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఇతర పనులను చేపట్టారు. ఇందులో ప్రధానంగా బోర్డు వాక్, పక్షిశాల, భారీ టన్నెల్ ఆక్వేరియంకు సంబంధించిన పనులు మొదలు పెట్టారు. ఎత్తయిన కొండలతో కూడిన ప్రాంతంలో అక్కడి సహజ వనరులను ధ్వంసం చేయకుండా నిర్మాణాలను చేపట్టారు. అందులో 2.5 కి.మీ దూరంతో బోర్డు వాక్ను నిర్మాణం పనులు ఇప్పటికే పూర్తి చేశారు.
అదేవిధంగా అతి పెద్ద పక్షిశాల (ఏవియరీ)కి సంబంధించిన ప్రహరీ పనులు చేపట్టారు. ఎకో పార్కులో 4.27 ఎకరాల స్థలంలో ఆక్వా మైరేన్ పార్కు నిర్మాణం ఉంటుంది. ఈ ఆక్వా మైరేన్ పార్కులో బహుళ సంఖ్యలో టన్నెల్స్ను నిర్మించి, అందులో వివిధ రకాల చేపలను ఉంచుతారు. ఇదే ప్రాంతంలో ప్రత్యేకంగా రెస్టారెంటును నిర్మించనున్నారు. అదేవిధంగా డోమ్ థియేటర్, 7డీ థియేటర్, వర్చువల్ అక్వేరియం, టచ్ ట్యాంక్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ఇంటరాక్టివ్ కియోస్క్లు ఉంటాయి. ఒకేసారి 2500 మంది సందర్శకులు వీక్షించేలా 2.50లక్షల చదరపు అడుగు విస్తీర్ణంలో నిర్మాణం ఉంటుంది.
వంద మీటరు పొడవుతో వంపు కలిగిన టన్నెల్ 3.5 మీటర్ల వెడల్పుతో నిర్మించి 180 డిగ్రీల కోణంలో గాజు అద్దంలోని నీళ్లలో ఉండే రకరకాలను చేపలను అత్యంత దగ్గర చూసేలా ప్రాజెక్టు డిజైన్ చేశారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఎకో పార్కు నిర్మాణం పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం పుల్స్టాప్ పెట్టింది. అత్యంత కీలకమైన ప్రాజెక్టుపై హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ఇప్పటి వరకు సమీక్ష చేయకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్ప ఎకో పార్కు ప్రాజెక్టు పనులు మొదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు.