Hyderabad | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో సెల్ఫోన్ల చోరీకి పాల్పడుతున్న 31 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా నుంచి 713 సెల్ఫోన్లు, రెండు కంప్యూటర్లు, ఒక ల్యాప్టాప్, స్కూటర్, ఆటో రిక్షాను స్వాధీనం చేసుకున్నారు. ఈ 31 మందిని పోలీసులు రిమాండ్కు తరలించారు. సీజ్ చేయబడిన ఫోన్ల విలువ రూ. 2 కోట్లు అని పోలీసులు తెలిపారు.
లంగర్హౌజ్లో ఈ నెల మొదట్లో ఓ వ్యాపారిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఇద్దరు దొంగలు కలిసి వ్యాపారిని హత్య చేసినట్లు పోలీసలు విచారణలో తేలింది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, సెల్ఫోన్ల చోరీ బయటపడింది. దొంగలు ఫోన్లను చోరీ చేసి, మరో గ్యాంగ్కు అప్పగిస్తున్నట్లు తేలింది. వీరు ఆ ఫోన్లను ఆఫ్రికన్ దేశాల్లో విక్రయిస్తున్నట్లు నిర్ధారణ అయింది.
15 మంది కలిసి సెల్ ఫోన్లను చోరీ చేస్తే మరో 16 మంది వాటిని కొనుగోలు చేసి, ఇతర దేశాల్లో విక్రయిస్తున్నారు. ఆపిల్ ఐఫోన్, శ్యాంసంగ్, వివో, రియల్మీ, వన్ ప్లస్, ఒప్పో లాంటి ఖరీదైన ఫోన్లను చోరీ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. దొంగిలించిన ఫోన్లను ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో.. వారు ముందే దొంగలకు డబ్బులు అప్పజెప్పి చోరీలకు ప్రోత్సహించినట్లు తేలింది.