మహేశ్వరం, ఆగస్టు 8: టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు థామస్రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచులు కోళ్లపడకల్ నుంచి పెద్ద గోల్కొండ వరకు రోడ్డును నిర్మించాలని మంత్రిని కలిసి కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామాల్లో దెబ్బతిన్న రోడ్లను దశలవారీగా మరమ్మతులు చేస్తామని చెప్పారు.
వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత రోడ్డు పనులను చేపట్టాలని ఆర్ఆండ్బీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఉపాధ్యక్షుడు హనుమగల్ల చంద్రయ్య, సర్పంచులు నారాయణ రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, మెగావత్ రాజూనాయక్, మోతీలాల్నాయక్, స్లీవారెడ్డి, కంది అరుణారమేశ్, బండారు లావణ్యాలింగం, మంత్రి సంధ్యారాజేశ్, గుత్తి పద్మాపాండు, ఉపసర్పంచ్ బురమోని నర్సింహ యాదవ్, నాయకులు వెంకటేశ్యాదవ్ పాల్గొన్నారు.