Hyderabad | హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి కారును నడుపుతూ అడ్డు వచ్చిన వారిని ఢీకొడుతూ వెళ్లాడు. దీంతో ఆగ్రహానికి గురైన స్థానికులు.. అతి కష్టం మీద కారును ఆపారు. కారును ఆపి డ్రైవింగ్ చేసిన వ్యక్తికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.