మెహిదీపట్నం, అక్టోబర్ 24 : విజయనగర్ కాలనీలో చోరీ కేసును హుమాయూన్నగర్ పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. ఇంట్లో వృద్ధురాలు ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఓ పనిమనిషి చోరీకి పాల్పడినట్లు గుర్తించి అదుపులోకి తీసుకొని 47 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దొంగతనం చేసిన పని మనిషితో పాటు ఆమెకు సహకరించిన మరో పని మనిషిని మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ మేరకు హుమాయూన్నగర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ సైదేశ్వర్, అదనపు ఇన్స్పెక్టర్ బాలకృష్ణతో కలిసి వివరాలు వెల్లడించారు.
మెహిదీపట్నం విజయనగర్కాలనీలో నివాసముండే వృద్ధురాలు గృహలక్ష్మి ఒంటరిగా ఉంటుంది. ఆమె ఇంట్లో గతంలో కోటమ్మ బస్తీకి చెందిన నందిపటి సునీత(30)పని పనిషిగా చేసి నెల రోజుల కిందటే మానేసింది. అక్టోబర్ 22న గృహలక్ష్మి ఇంటికి సునీత తనతో పాటు మరో మహిళ పుష్ప (35)ను తీసుకువచ్చింది. గృహలక్ష్మి స్నానానికి వెళ్లగానే అల్మారాలో దాచిన సుమారు 47 తులాల బంగారు ఆభరణాలను దోచుకొని పారిపోయారు. స్నానం పూర్తి చేసుకొని వచ్చిన గృహలక్ష్మి అల్మారా తెరిచి ఉండటాన్ని చూసి తన కుమారుడికి తెలిపింది. వెంటనే హుమాయూన్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సునీతపై అనుమానంతో మెహిదీపట్నంలో పట్టుకొని విచారించగా చోరీ చేసినట్లు ఒప్పుకున్నది. మంగళవారం ఆమె వద్ద నుంచి 47 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు సునీత, పుష్పను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.