హైదరాబాద్: ఖైరతాబాద్లో కొలువైన పంచముఖ రుద్ర మహాగణపతిని భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకుంటున్నారు. గణేశుడికి గజమాల సమర్పించారు. ఉదయం 11.30 గంటలకు తొలిపూజలు ప్రారంభంకానున్నాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌదరరాజన్, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొంటారు.
40 అడుగుల ఎత్తులో ఉన్న పంచముఖ రుద్ర మహాగణపతికి పద్మశాలి సంఘం కండువా, జంజం, గరికమాలను సమర్పించింది. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవి, అదనపు కలెక్టర్ వెంటకటేశ్వర్లు, డీఐజీ విశ్వప్రసాద్ పాల్గొన్నారు.