హైదరాబాద్: దసరా పండుగ సెలవులు ముగియడంతో ప్రజలు హైదరాబాద్ (Hyderabad) తిరిగి చేరుకుంటున్నారు. దీంతో ఎల్బీనగర్ (LB Nagar) పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎంతకూ వాహనాలు కదలక పోవడంతో జనం మెట్రో రైలును (Metro Train) ఆశ్రయించారు. దీంతో ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ (LB Nagar Metro Station) వద్ద ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. ఈ నేపథ్యంలో మెట్రో సిబ్బంది ప్రయాణికులను క్యూ పద్ధతిలో పంపిస్తున్నారు. జిల్లాల నుంచి వచ్చినవారితోపాటు ఆఫీసులు, వివిధ పనుల నిమిత్తం వెళ్లేవారు పెద్ద సంఖ్యలో ఉండటంతో కీలోమీటర్ మేర క్యూలైన్లో నిల్చున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. క్యూలైన్ నుంచి ఫ్లాట్ఫారం వద్దకు చేరేందుకు సుమారు రెండు గంటల సమయం పడుతున్నది.
మరోవైపు చౌటుప్పల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నల్లగొండ జిల్లా చిట్యాల నుంచి పెద్దకాపర్తి వరకు వాహనాలు నిలిచిపోయాయి. దసరా చెలవులు ముగియడంతో జనం హైదరాబాద్ బాట పట్టారు. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పంతంగి టోల్ప్లాజా వద్ద వాహనాల రద్దీ నెకలొకన్నది. ట్రాఫిక్ సమస్య నెలకొనకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.