సుల్తాన్బజార్, మార్చి 1 : కింగ్కోఠి క్లస్టర్ ఎస్పీహెచ్వో, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ పద్మజ నేతృత్వంలో క్లస్టర్ పరిధిలోని ఆరు యూపీహెచ్సీల పరిధిలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాల్లో ప్రజలు పరీక్షలను చేయించుకుంటున్నారు. క్లస్టర్ పరిధిలో నేటి వరకు 19,165 మందికి పరీక్షలు పూర్తిచేశామని వైద్యులు తెలిపారు. అవసరమైన 6080 మందికి రీడింగ్ కంటి అద్దాలు, మందులను ఉచితంగా అందజేశామన్నారు.
3284 మందికి క అద్దాల కోసం ప్రిస్కిప్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగిందని వైద్యాధికారి డాక్టర్ మనోజ్ తెలిపారు. క్లస్టర్ పరిధిలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలని వైద్యాధికారులు సందర్శించి ఆయా కేంద్రాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకుంటున్నారు.కంటి వెలుగు కార్యక్ర మాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశవర్కర్లు అవగాహన కల్పిస్తున్నారు. కింగ్ కోఠి క్లస్టర్ పరిధిలోని ఆరు యూపీహెచ్సీల పరిధిలో ఏర్పాటు చే సిన ఈ శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారులు పిలుపునిచ్చారు.