బాలానగర్, డిసెంబర్ 22 : ఇంటినుంచి బయటకు వెల్లిన గృహిణి అదృశ్యమైన సంఘటన బాలానగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ఎండీ వహీదుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం..కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధి రంగారెడ్డినగర్లో నివాసముండే మదన్గిరి భార్య ప్రీతి (30) కొంత కాలంగా తరుచూ భర్తతో గొడవ పడుతుండేది.
కాగా ఈ నెల 20న భర్తతో గొడవ పడి ఇంటినుంచి బయటకు వెల్లిన ప్రీతి తిరిగి ఇంటికి రాలేదు. ఆమె కోసం పరిసర ప్రాంతాలు, బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా పలితం లేకపోవడంతో ఆమె తల్లి మీరా భాయిగోస్వామి బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ప్రీతి కోలా ముఖం కలిగి ఉంటుంది. ఒంటిపై ఎర్రటి రంగుగల నైట్ డ్రెస్ దరించి ఉంది. ఎత్తు 5.6 అడుగులు ఉంటుంది. ఫేర్ కలర్లో ఉంటుంది. ఎవరికైనా కనిపిస్తే బాలానగర్ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.