కాచిగూడ,ఆగస్టు 24: బీసీల సమస్యలను పరిష్కారించేందుకు సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతో ఉన్నాడని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు అన్నారు. తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్గా నియామితులైన శుభ సందర్భంగా.. మంగళవారం ముద్ర కో-ఆపరేటివ్ సొసైటీ కార్యాలయానికి విచ్చేశారు.
ఈ సందర్భంగా మానవ హక్కుల కమిషన్ ప్రచార సభ్యుడు, ముద్ర మల్టీస్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ తిప్పినేని రామదాసప్పనాయుడు మార్యాదపూర్వకంగా కలిసి శాలువతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సోసైటీ సిబ్బంది కె.నర్సింహ, శాంతి, జి.జ్యోతి, తిరుపతి, బి.ఆనంద్, రచ్చ శ్రీనివాస్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.