సిటీబ్యూరో, జూలై 30 (నమస్తే తెలంగాణ ): హైదరాబాద్ మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేజ్-2 రింగ్ మెయిన్-2 నాగోల్ జంక్షన్ వద్ద ఆటో టాక్ నుంచి చర్బుజా మార్బుల్స్ వరకు 1600 ఎంఎం డయా ఎంఎస్ మెయిన్ పైపులైన్కు జంక్షన్ పనులు చేపడుతున్నారు. ఈ పనుల కారణంగా ఆగస్టు 4న ఉదయం 6 గంటల నుంచి 5న ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు ఈ పనులు కొనసాగనున్నా యి. దీంతో పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని జలమండలి అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
డివిజన్ నం.2లోని బాలాపూర్, మైసా రం, బారాస్, డివిజన్ 5లోని మేకలమండి, భోలక్ పూర్, డివిజన్ నం.7లోని తార్నాక, లాలాపేట్, భౌద్దనగర్, మారేడ్పల్లి, కంట్రోల్ రూమ్, రైల్వేస్, ఎంఈఎస్, కంటోన్మెంట్, ప్రకాశ్నగర్, పాటిగడ్డ, డివిజన్ 9 హస్మత్ పేట్, ఫిరోజ్ గూడ, గౌతమ్ నగర్, డివిజన్ 10లోని వైశాలీనగర్, బీఎన్రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, మారుతీనగర్, డివిజన్ 13లోని మహీంద్ర హిల్స్, డివిజన్ 14లోని ఏలుగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిలుకానగ ర్, బీరప్పగడ్డ, డివిజన్ 19లోని బోడుప్పల్, డివిజన్ 20లోని మీర్ పేట్, బడంగ్ పేట్, శంషాబాద్ ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అధికారులు పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.