హైదరాబాద్: హెచ్ఎండీఏ విజిలెన్స్ మాజీ డీఎస్పీ జగన్ అరెస్టయ్యారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న కేసులో ఆయన్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జగన్తోపాటు సెక్యూరిటీ గార్డు రామును కూడా అరెస్టు చేశారు. జగన్ ఇంటిపై దాడి చేసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు.. సుమారు 14 గంటలపాటు సోదాలు చేశారు.
హెచ్ఎండీఏలో పనిచేస్తున్న సమయంలో జగన్.. అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో జగన్తోపాటు ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు చేశారు. ఈ సమయంలోనే బోడుప్పల్, కొర్రెముల, జోడిమెట్లలో జగన్ కొన్ని వెంచర్లు వేసినట్లు అధికారులు గుర్తించారు. అలాగే బినామీ పేరుతో ఒక పెట్రోలు బంకు కూడా నడుపుతున్నట్లు విచారణలో తేలింది.