సిటీబ్యూరో, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): మోకిలలో హెచ్ఎండీఏ ప్లాట్ల కొనుగోలుకు విశేష స్పందన లభించింది. ఐటీ కారిడార్కు సమీపంలో హెచ్ఎండీఏ భారీ లేవుట్ను అభివృద్ధి చేసి ఆన్లైన్ వేలం నిర్వహించింది. సోమవారం నిర్వహించిన వేలంలో చదరపు గజానికి రూ.గరిష్ఠంగా రూ.1,05,000 లక్షలు, కనిష్ఠంగా రూ.72వేలు చొప్పున మొత్తం 50 ప్లాట్లను విక్రయించారు. అన్ని ప్లాట్లకు కలిపి చదరపు గజానికి సరాసరి రూ.80,397 ధర పలికిందని, రెండు సెషన్లలో జరిగిన ఆన్లైన్ వేలంలో మొత్తం రూ.121.40 కోట్ల ఆదాయం వచ్చిందని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ఒక్కో ప్లాటు కనీస మద్దతు ధరను రూ.25వేలుగా నిర్ణయిస్తే, అంతకు మూడు రెట్లు అధికంగా కొనుగోలుదారులు చెల్లించి ఆన్లైన్లో కొనుగోలు చేశారని పేర్కొన్నారు.
త్వరలో రెండో దశ వేలం..
మోకిలలో హెచ్ఎండీఏ మొత్తం 165 ఎకరాల్లో భారీ లేఅవుట్ను అభివృద్ధి చేస్తోంది.శంకర్పల్లి-మెహిదీపట్నం రోడ్డు నుంచి 2 కి.మీ లోపలికి ఉన్న ఈ లేఅవుట్లో రెండో దశ వేలంను త్వరలోనే నిర్వహిస్తామని, దీనికి సంబంధించిన షెడ్యూలు ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. మొదటి దశ వేలంలో 50 ప్లాట్లను విక్రయించామని పేర్కొన్నారు.