శేరిలింగంపల్లి, డిసెంబర్ 19: దేశంలోనే మొదటిసారిగా క్యాన్యర్ రోగులకు రెండు అరుదైన శస్త్రచికిత్సలు కాంటినెంటల్ వైద్య బృందం విజయవంతంగా నిర్వహించిందని హాస్పిటల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి తెలిపారు. మంగళవారం హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. క్యాన్సర్కు విజయవంతంగా శస్త్రచికిత్సను అందించేందుకు అధునాతన చికిత్స విధానాలను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు.
కాంటినెంటల్ క్యాన్సర్ కేర్ సెంటర్ మెడికల్ ఆంకాలజిస్టు డాక్టర్ ఏవీఎస్ సురేశ్ మాట్లాడుతూ.. అత్యంత ప్రమాదకరమైన గ్లీయోబ్లాస్టోమా మెదడు క్యాన్సర్తో చాలా కాలంగా బాధపడుతున్న ఓ యువతికి విజయవంతంగా శస్త్రచికిత్స చేశామని చెప్పారు. అధునాతన డెంట్రీటెక్ సెల్ థెరపీ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామన్నారు. కాంటినెంటల్ క్యాన్యర్ కేర్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ జగన్నాథ్ మాట్లాడుతూ 30 సంవత్సరాల ఓ యువతి పెండ్లి అయిన మూడు సంవత్సరాలకు పిల్లలు కలగడం లేదని కడుపులో పెద్ద కణతి ఉందని బాధపడుతూ కాంటినెంటల్కు రావడం జరిగిందన్నారు. కాంటినెంటల్ వైద్య బృందం 15 కిలోల కణితిని ఆమె కడుపులోంచి తొలగించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంటినెంటల్ న్యూరో సర్జన్ డాక్టర్ అజయ్ రెడ్డి తదితర వైద్యులు పాల్గొన్నారు.