2014: అన్నపూర్ణ భోజన కార్యక్రమం
2015: నగర తాగునీటి కోసం కృష్ణాజలాల తరలింపు పథకం మూడో విడత
2017: మల స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంటు, హైదరాబాద్ మెట్రో రైలు, అవుటర్ రింగు రోడ్డు, మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్
2018: బస్తీ దవాఖానలు, డిజాస్టర్ రెస్పాన్స్, ఎన్ఫోర్స్మెంట్
2019: సమగ్ర రహదారి నిర్వహణ కార్యక్రమం ప్రారంభం (సీఆర్ఎంపీ), మిస్సింగ్ లింక్ రోడ్ల దీక్ష, ఎస్ఆర్డీపీలో భాగంగా ఏడు ప్రాజెక్టులు ప్రారంభం
2020: 20 కేఎల్ ఉచిత నీటి సరఫరా కార్యక్రమం, పూర్తి స్ట్రెచ్ కోసం అవుటర్పై విద్యుద్దీకరణ, మోడల్ రోడ్ కారిడార్లు, ఎస్ఆర్డీపీలో భాగంగా మూడు ప్రాజెక్టులు ప్రారంభం, పట్టణ ప్రగతి, మొజంజాహీ మార్కెట్ పునరుద్ధరణ
2021: వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ప్రారంభం, కోకాపేట నియోపోలిస్ మొదటి విడత వేలం, వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం ప్రారంభం (ఎస్ఎన్డీపీ), ఎస్ఆర్డీపీలో భాగంగా తొమ్మిది ప్రాజెక్టులు ప్రారంభం, బాటసింగారం లాజిస్టిక్స్ పార్కు ప్రారంభం
2022: విమానాశ్రయం మెట్రో ప్రాజెక్టు శంకుస్థాపన, ఎస్ఆర్డీపీలో భాగంగా ఆరు ప్రాజెక్టులు ప్రారంభం, ఏఐపీహెచ్ ద్వారా హైదరాబాద్కు వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు, ఉస్మాన్సాగర్ వద్ద ల్యాండ్స్కేప్ పార్కు
2023: సుంకిశాల ఇన్టేక్ ప్రాజెక్టు, అవుటర్ విస్తరించిన ప్రాంతాలకు నీటి సరఫరా నెట్వర్క్, హైదరాబాద్లో 31 మురుగునీటి శుద్ధి కేంద్రాల ద్వారా వంద శాతం శుద్ధి, దుండిగల్ వేస్ట్ టు ఎనర్జీ 15 మెగావాట్ల ప్రాజెక్టు, ఎస్ఆర్డీపీలో భాగంగా ఆరు ప్రాజెక్టుల ప్రారంభం, అవుటర్ వెంట సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్, ఉప్పల్, మెహిదీపట్నం స్కైవాక్స్, అవుటర్ రింగు రోడ్డు టీవోటీ, ఇ-గ్రాండ్ ప్రిక్స్ హోస్టింగ్
2024: హైదరాబాద్లో వంద శాతం మురుగునీటి శుద్ధి, జవహర్నగర్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటు రెండో దశ (మొత్తం 48 మెగావాట్లు)
చరిత్రలో తమకంటూ గుర్తింపు దక్కించుకున్న మార్కెట్లు ఉమ్మడి పాలనలో కనుమరుగైతే.. తెలంగాణ ప్రభుత్వం వాటికి జీవం పోసింది. అందులో భాగంగానే మొజంజాహి మార్కెట్, లాడ్ బజార్లను పునరుద్ధరించింది. ఇవి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల వారధిగా ఉన్న ట్యాంక్బండ్ను హెచ్ఎండీఏ రూ.38 కోట్లతో సుందరీకరించింది. అదేవిధంగా హుస్సేన్సాగర్లో దేశంలోనే అతి పెద్ద మ్యూజికల్ ఫ్లోటింగ్ ఫౌంటెయిన్ను ఏర్పాటు చేశారు. ఇది పర్యాటకులకు మరింత ఆకర్షణీయంగా మారింది.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రతి ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా పట్టణ ప్రాంతాలలో ఉద్యాన వనాలను ఏర్పాటు చేశారు. పట్టణ అడవులు, పట్టణ ప్రకృతి, రోడ్ల వెంబడి, అవెన్యూ ఫ్లాంటేషన్, నగర పార్కులు, టెర్రస్ గార్డెన్స్ను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ మహానగరంలో ఫ్లై ఓవర్లు, ఆర్వోబీ, ఆర్యూబీలు, రహదారులు, నాలాల విస్తరణ, లింకు రోడ్లు వంటి అభివృద్ధి పనుల కోసం భూములు, ఆస్తులను సేకరించాలంటే ఏళ్ల తరబడి సమయం పట్టేది. ఇదంతా ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది. 2017లో మంత్రి కేటీఆర్ తీసుకొచ్చిన ‘టీడీఆర్’ పాలసీతో చకచకా పనులు కొనసాగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో వివిధ అభివృద్ధి పథకాల కోసం చేపట్టే భూ సేకరణ, ఆస్తుల సేకరణ సందర్భంగా ఇచ్చే నగదు నష్ట పరిహారానికి బదులుగా ప్రవేశపెట్టిన ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్)లో సత్తా చాటుతున్నది. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ జారీ చేసిన టీడీఆర్ సర్టిఫికెట్లు 1923కు చేరాయి. ఇందులో 812 ఎకరాల భూమిని సేకరించారు. దేశంలో మరే ఏ నగరంలో జరుగని విధంగా రికార్డు స్థాయిలో ఈ టీడీఆర్లను జీహెచ్ఎంసీ అందజేసింది. ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన జీహెచ్ఎంసీని కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నీతి అయోగ్ ప్రశంసించడం గమనార్హం. ఈ టీడీఆర్ విధానాన్ని ఇతర రాష్ర్టాలు కూడా అవలంభించడానికి నీతి అయోగ్ సూచించింది.
భూగర్భ జలాలను సంరక్షించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మెట్లబావులను పునరుద్ధరించి చారిత్రక సంపదను పదిల పరిచింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ సంయుక్తంగా పురాతన స్టెప్వెల్లను అభివృద్ధి చేశాయి. అందులో భాగంగా బన్సీలాల్పేట్ స్టెప్వెల్, బాపూఘాట్ దిగుడు మెట్లబావి, శివ్బాగ్, కబోరా హౌస్, భగవాన్ దాస్, ఆనంద్ కాలనీ, గచ్చిబౌలి, ఎంజీ మెమోరియల్, స్వర్ణ సాయిబాబా మందిరం, విక్టోరియా మెమోరియల్ హోం, బుద్ధ భవన్, గోల్కొండలోని కుతుబ్షాహీ టోంబ్ కాంప్లెక్స్ తదితర ప్రాంతాల్లోని మెట్ల బావులను అభివృద్ధి చేసింది. ఇందులో బన్సీలాల్ పేట్ దిగుడు మెట్లబావి పునరుద్ధరణపై ప్రభుత్వ కృషిని ప్రధాన మంత్రి ప్రశంసించారు. వాటర్ సోర్స్ రూపంలో ఈ ప్రాజెక్టు జాతీయ దృష్టిని ఆకర్శించింది. అంతేకాదు సస్టెనబుల్ ఇనిషియేటివ్ ఆఫ్ ది ఇయర్ బిగ్ 5 కన్స్ట్రక్షన్ ఇంపాక్ట్ అవార్డును అందుకుంది.
గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ 158 కి.మీ మేర అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఔటర్ రింగు రోడ్డు ప్రాజెక్టును 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చారు. దీంతో హెచ్ఎండీఏకు ఒకేసారి రూ.7380 కోట్లు రానున్నాయి.
దేశంలోనే మొదటి సారిగా ఫార్ములా ఈ-రేసుని హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించారు. 2023 ఫిబ్రవరి 11న నగరం నడిబొడ్డున హుస్సేన్సాగర్ తీర ప్రాంతంలో 2.8 కి.మీ మేర రేసింగ్ ట్రాక్పై పోటీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. హైదరాబాద్ స్ట్రీట్ సర్యూట్ జరిగిన ఫార్ములా ఈ-ఎలక్ట్రికల్ కార్ రేస్ నగర ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది.
పట్టణ ప్రాంతంలో అర్బన్ ఫారెస్ట్ బ్లాక్లను ఏర్పాటు చేశారు. హెచ్ఎండీఏ పరిధిలో 16 పట్టణ అడవుల పార్కులను 14,643 ఎకరాల్లో ఏర్పాటు చేయగా, ఇందుకోసం రూ.116.63 కోట్లు వెచ్చించారు.
గత తొమ్మిదేండ్ల కాలంలో ఊహించనిరీతిలో జరిగిన నగరాభివృద్ధి ఇక ముందు కూడా అదే వేగంతో జరిగేలా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ విడుదల చేసిన నివేదికలో రోడ్మ్యాప్ కూడా పొందుపరిచారు.