హైదరాబాద్ : వివాహేతర సంబంధం కేసులో ఓ ఇన్స్పెక్టర్ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కందుకూరు మండలం, బేగంపేట గ్రామానికి చెందిన రాజు (2002 బ్యాచ్) హైదరాబాద్ సౌత్ జోన్ కంట్రోల్ రూమ్లో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. తన భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో కొద్దిరోజులుగా ఆమె భర్తను వెంబడిస్తుంది.
పక్కా సమాచారం అందుకున్న ఆమె గుర్రంగూడ సమీపంలోని చెట్లలో కారులో భర్త, వేరే మహిళతో కలిసి ఉండడాన్ని తెలుసుకుని తన ఇద్దరు పిల్లలతో కలిసి అక్కడికి వెళ్లింది. ఈ క్రమంలో అక్కడ ఘర్షణ చోటు చేసుకోవడం, పిల్లల అరుపులు వినిపించడంతో పెట్రోలింగ్ కానిస్టేబుల్స్ రామకృష్ణ, హోంగార్డు నాగార్జున నాయుడు అక్కడికి వెళ్లారు. కానిస్టేబుల్, హోంగార్డుపై కూడా ఇన్స్పెక్టర్ దాడికి దిగాడు. ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలయ్యాయి. ఇన్స్పెక్టర్ రాజును పోలీసులు అరెస్టు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుకు తరలించగా పోలీసులకు సహకరించలేదు. ఈ మేరకు నిందితుడు రాజును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.