SBI | ఎస్బీఐ (SBI) భూముల వేలంపై హైకోర్టు స్టే విధించింది. కాంగ్రెస్ సర్కార్ గత నెల 28వ తేదీన రాయదుర్గం పరిధిలో ఉన్న నాలెడ్జ్ సిటీలోని సర్వే నంబర్ 83/1లో ఉన్న భూమిని ఒక్కో ఎకరం రూ.237 కోట్ల చొప్పున ఆక్షన్ (వేలం) ద్వారా విక్రయించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం తమకు చెందిన భూమిని విక్రయించిందని SBI హైకోర్టును ఆశ్రయించింది.
రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.237 కోట్లు అని ప్రచారం చేసుకున్న భూమి తమదేనని.. ఆ భూమిలో 5 ఎకరాలు తమవేనని, సదరు భూమిపై రిట్ ఆర్డర్ ఇవ్వాలని SBI హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో టీజీఐఐసీ భూముల వేలంపై నేడు హైకోర్టు 3 వారాలు స్టే విధించింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని ఎస్బీఐ, టీజీఐఐసీ, గౌర వెంచర్స్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
బ్రేకింగ్ న్యూస్
ఎస్బీఐ భూముల వేలంపై తెలంగాణ హైకోర్టు స్టే
గత నెల 28వ తేదిన రాయదుర్గం పరిధిలో ఉన్న నాలెడ్జ్ సిటీలోని సర్వే నంబర్ 83/1లో ఉన్న భూమిని ఒక్కో ఎకరం రూ.237 కోట్ల చొప్పున ఆక్షన్ ద్వారా విక్రయించిన కాంగ్రెస్ ప్రభుత్వం
అయితే ఆ భూమిలో 5 ఎకరాలు తమవేనని, సదరు భూమిపై రిట్… https://t.co/u6x8s2MjLx pic.twitter.com/FzfR6bjE02
— Telugu Scribe (@TeluguScribe) June 18, 2026
SBI భూమిని విక్రయించిన తెలంగాణ ప్రభుత్వం
ఎకరానికి రూ.237 కోట్లు అని ప్రచారం చేసుకున్న భూమి తమదేనని హైకోర్టును ఆశ్రయించిన SBI
గత నెల 28వ తేదిన రాయదుర్గం పరిధిలో ఉన్న నాలెడ్జ్ సిటీలోని సర్వే నంబర్ 83/1లో ఉన్న భూమిని ఒక్కో ఎకరం రూ.237 కోట్ల చొప్పున ఆక్షన్ ద్వారా విక్రయించిన… https://t.co/7lwi0QB6LZ pic.twitter.com/3WCBQeYFj3
— Telugu Scribe (@TeluguScribe) June 17, 2026