Heroin | హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. ఓ మహిళా ప్రయాణికురాలి వద్ద 5.9 కిలోల హెరాయిన్ను గుర్తించి, సీజ్ చేశారు. ఈ పట్టుబడ్డ హెరాయిన్ విలువ మార్కెట్లో రూ. 41.3 కోట్ల విలువ చేస్తుందని డీఆర్ఐ అధికారులు తెలిపారు. హెరాయిన్ కలిగిన ప్రయాణికురాలు మాలావి నుంచి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. సూట్కేసులో హెరాయిన్ తరలిస్తున్నట్లు తెలిపారు. ఆ మహిళను డీఆర్ఐ అధికారులు శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.