Traffic Jam | హైదరాబాద్ : హైదరాబాదీలను ట్రాఫిక్ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. సోమవారం ఉదయం నుంచి నగరంలోని పలు చోట్ల భారీగా ట్రాఫిక్జామ్ ఏర్పడింది. మధ్యాహ్నం సమయంలో ఎస్ఆర్ నగర్ నుంచి మూసాపేట వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ సంభవించింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో అటు వాహనదారులు, ఇటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాలు ముందుకు కదలకపోవడంతో.. కొందరైతే కాలినడకన వెళ్లిన పరిస్థితి ఏర్పడింది. నగరంలో ట్రాఫిక్జామ్పై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ అంటే అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో సమయానికి కార్యాలయాలకు వెళ్లలేని పరిస్థితి ఉందని ఉద్యోగులు వాపోయారు.