హైదరాబాద్ : నగరంలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో వాయుగుండం కేంద్రీకృతం కావడంతో పాటు తుర్పు పడమర దిశలో షియర్ జోన్ ఏర్పడింది. దీని ప్రభావం గ్రేటర్కు అతి సమీపంలో ఉన్న యాదాద్రి భువనగిరి, వికారాబాద్ జిల్లాలపై అధికంగా ఉండనున్నది. దీంతో గ్రేటర్లో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.