హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఈ సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు ఈవీడీఎం డైరెక్టర్ అధికారికంగా ట్వీట్ చేశారు. నగరంలోని శేరిలింగంపల్లి జోన్లో మరో 30 నిమిషాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. శేరిలింగంపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ ఏరియాలో వెళ్లే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయని డైరెక్టర్ స్పష్టం చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు కుత్బుల్లాపూర్లో 3 మి.మీ., కూకట్పల్లిలో 2.5 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది.
Possibility of moderate to heavy rainfall over Serilingampally Zone spreading to other areas of the city in the next 30 minutes. Citizens may plan their travel accordingly. DRF teams alerted and on field. @KTRTRS @arvindkumar_ias @CommissionrGHMC pic.twitter.com/ZmszlvHdr3
— Director EV&DM, GHMC (@Director_EVDM) July 28, 2022